← Back to news

మల్లన్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఆగ్రహం

By gurrala nagaraju· 26 Aug 2026· Yadadri Bhuvanagiri
మల్లన్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ఆగ్రహం

TG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న వ్యవహారశైలి సరికాదని మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునాథ రాజు విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆలేరులో బీసీ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై మల్లన్న పోటీకి సిద్ధపడటం సమంజసం కాదన్నారు. సొంత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపైనే పోటీ చేయడం ద్వారా బీసీల మధ్య ఐక్యతను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.