← Back to news

విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: రాహుల్ గాంధీ

By Mahesh· 25 Jul 2026· Delhi
విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: రాహుల్ గాంధీ

నిరవధిక దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ జరిగిందని, వేలాది మంది విద్యార్థులు గాయపడ్డారని అన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న మూడు డిమాండ్లు న్యాయమైనవేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దని వారికి సూచించారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు.

విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే: రాహుల్ గాంధీ

More in Politics