← Back to news

ఆర్థిక ఇబ్బందుల మధ్య అద్భుత ప్రతిభ

By aveen kumar· 24 Aug 2026
ఆర్థిక ఇబ్బందుల మధ్య అద్భుత ప్రతిభ

TG: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సంజన ప్రభుత్వ పాఠశాలలో చదివి 548 మార్కులతో ఉన్నత విద్యకు ఎంపికై ప్రతిభ చాటింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామచంద్రరావు బంజర్‌కు చెందిన సింగిశాల యేసురావు, నాగరాణి దంపతుల కుమార్తె సంజన టేకులపల్లి ఆదర్శ పాఠశాలలో పదోతరగతి చదివి 548 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. మహబూబ్‌నగర్ సమగ్ర విద్యా సంస్థలో సీటు సంపాదించింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సాధించిన విజయంపై తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధులు ఎల్‌.ఎస్‌.రెడ్డి, కిన్నెర వెంకటేశ్వరరావు సంజనను సన్మానించారు.

More in Local