← Back to news

గురుకుల విద్యార్థులకు క్రీడా పోటీలు

By Adithya D· 4d ago
గురుకుల విద్యార్థులకు క్రీడా పోటీలు

ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల సంక్షేమ పాఠశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ నీతాపోల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యత గురించి వివరించారు. కోకో, కబడ్డీ, హాకీ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.