గురుకుల విద్యార్థులకు క్రీడా పోటీలు

ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల సంక్షేమ పాఠశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ నీతాపోల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యత గురించి వివరించారు. కోకో, కబడ్డీ, హాకీ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు.



