school కూల్చారు.. పిల్లలెక్కడ చదవాలె?

బుల్టోజరుతో పని చేయించిన అధికారులకు సోయి తప్పింది. అనుమతి లేదనే పేరిట, అనుమతి ఉన్న ZPHS బిల్డింగును కూడా కూల్చేశారు. పిల్లలకు క్లాసు రూములు లేకుండా పోయినయ్. ఈ విషయాన్ని PDSU జిల్లా అధ్యక్షుడు హాలిం పాషా ప్రజావాణిలో అధికారులకు complaint ఇచ్చారు. ’’అడ్డగోలుగా, మతి తప్పి పిల్లల స్కూలును కూల్చినోళ్ల మీద చర్యలు తీసుకోవాల’’ని డిమాండ్ చేశారు. ఇప్పుడు పిల్లల క్లాసురూముకు ఎక్కడైనా జాగా చూపెట్టాలన్నారు. వెంటనే కొత్త బిల్డింగు కట్టియ్యాలన్నారు. అధికారులేం చేస్తరో చూడాలి మరి.



