వైద్యుడా.. రాక్షసుడా?
చిత్తూరు జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో బాధితుల బంధువులు వైద్యం చేయమని కోరారు. డాక్టర్ 'వైద్యం చేయను ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి' అంటూ వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీన్ని బాధితులు ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట వైరల్గా మారింది. రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న డాక్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



