నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి

AP: ప్రభుత్వ కార్యాలయాల సమీపంలోని భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూములను ఆక్రమించి మతపరమైన కట్టడాలు నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగితే భవిష్యత్తులో గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి నిర్మాణాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.




