USFI నేతల అరెస్ట్.. కరీంనగర్లో ఉద్రిక్తత

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలను ఖండిస్తూ కరీంనగర్లో MP బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు USFI నాయకులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి నాయకులను కరెంట్ ఆఫీస్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడులు ప్రజాస్వామ్య విరుద్ధమని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన వారినే అరెస్టు చేయడం అన్యాయమని నాయకులు ఫైరయ్యారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



