← Back to news

చెడు మార్గంలో యువత

By BASKAR· 23 Aug 2026· మంగళగిరి
చెడు మార్గంలో యువత

AP : గుంటూరు జిల్లా మంగళగిరిలో DYFI 14వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడారు. డ్రగ్స్ మాఫియా వల్లే నేటి యువత చెడు మార్గంలోకి వెళ్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, నిరుద్యోగం కూడా రోజురోజుకూ పెరిగిపోతోందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు పోరాడినట్లే, నేడు కూడా స్వేచ్ఛ కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

More in Local