← Back to news

భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు

By Chanti· 22 Aug 2026· Burgampadu, Burgampahad, Bhadradri Kothagudem
భద్రాద్రి రామయ్య భక్తుల కష్టాలకు తెర.. రూ.185 కోట్లు

భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణ కష్టాలకు త్వరలో తెరపడనుంది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న బూర్గంపాడు ప్రాంత రహదారుల కోసం ప్రభుత్వం రూ.185.57 కోట్లు మంజూరు చేసింది. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, బూర్గంపాడు–పాల్వంచ లింక్ రోడ్డు కోసం రూ.17.56 కోట్లు కేటాయించారు. ఈ మార్గం అభివృద్ధి చెందితే భద్రాచలం వెళ్లే భక్తుల ప్రయాణం సులభతరం కానుంది. రోడ్డు నిర్మాణం వల్ల కాలయాపన పోయి నిత్యం రాకపోకలు సాగించే స్థానికులు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.

More in Local