మంచంపై పడుకున్నావని అడిగినందుకు కిరాతక హత్య
AP: మంచంపై ఎందుకు పడుకున్నావని అడిగినందుకు 90 ఏళ్ల వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనలో నిందితుడు సజీవ్ కుమార్ను కలిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం సమీపంలో మూడు రోజుల క్రితం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధుడు రామిరెడ్డి ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన సజీవ్ కుమార్ కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం కలిగిరి సీఐ సుబ్బారావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.


