సైబర్ మోసాలపై అవగాహన

TG: ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బజార్హత్నూర్ పోలీసులు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మొబైల్ ద్వారా జరిగే సైబర్ మోసాలపై ప్రజలకు వివరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే ఓటీపీలు, మెసేజ్లు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు, వ్యక్తిగత వివరాలతో కూడిన ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదని తెలిపారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.



