మిలాద్ ఉన్ నబీ పండుగ వేళ పటిష్ట బందోబస్తు

AP: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.


