← Back to news

మిలాద్ ఉన్ నబీ పండుగ వేళ పటిష్ట బందోబస్తు

By Buditi Sangeetarao· 26 Aug 2026· East Godavari
మిలాద్ ఉన్ నబీ పండుగ వేళ పటిష్ట బందోబస్తు

AP: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.