ములగలంపాడులో తాగునీటి కష్టాలు.. ప్రజల అవస్థలు

AP: నెలరోజులుగా తాగునీరు లేక ప్రజల అవస్థలు.. మోటార్ పనిచేయక గ్రామంలో తీవ్ర ఇబ్బందులు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములగలంపాడు గ్రామంలో నెల రోజులుగా మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ట్యాంకుకు నీటిని ఎక్కించే మోటార్ పనిచేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.



