← Back to news

3 మేయర్లు కాదు.. ముందు ఒక కార్పొరేషన్ గెలిపించండి

By DK· 19 Jul 2026· హైదరాబాద్

TG: BJP నుంచి బయటకు వెళ్లిన గోషామహల్ MLA రాజాసింగ్ మరోసారి పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన, MP ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. త్వరలో జరగనున్న GHMC ఎన్నికలపై మాట్లాడుతూ, 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం కాదు, ముందుగా ఒక కార్పొరేషన్‌లో సగం కార్పొరేటర్లను గెలిపించి చూపించాలని సవాల్ విసిరారు.

More in Politics