← Back to news

వెలిగొండ పనుల్లో స్పీడ్ పెంచాలి: మంత్రి నిమ్మల

By pathan rasool khan· 26 Aug 2026

AP: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఫీడర్ కెనాల్‌లలో మిగిలిన పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. కెనాల్‌లలో ఏర్పాటు చేసిన నాలుగు గేట్లను పరిశీలించిన మంత్రి, సీఎం జలహారతి ఇచ్చే ప్రాంతంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందుగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

More in Local