జంతర్ మంతర్ వద్ద గర్జించిన అభిజీత్ దీప్కే!
జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ నుండి సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా తరలించిన తర్వాత యాక్టివిస్ట్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం, తలవంచం" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యల కంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే మోదీ ప్రభుత్వానికి ఎక్కువ అనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. సోనమ్ సార్ను పోలీసులు నేరస్థుల్లా కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, తమ గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు.


