కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఆయనకేనా!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర నాయకత్వం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలకు దిల్లీ నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఫడ్నవిస్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి దక్కే అవకాశముందని, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండొచ్చని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.



