← Back to news

అక్రమంగా మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ సీజ్‌

By epuri rajaratnam· 3d ago
అక్రమంగా మట్టి తవ్వకాలు.. జేసీబీ, లారీ సీజ్‌

AP: నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోటుపాలెం, చిల్లకూరు మండలం నాంచారమ్మపేట సరిహద్దుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న జేసీబీ, లారీని గూడూరు రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ తవ్వకాలతో భూమి స్వరూపం దెబ్బతినడంతో పాటు వ్యవసాయ భూములకు, పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.