← Back to news

డబ్బు ఆశ చూపించి గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

By K. RAJASHEKAR KMR· 22 Aug 2026· Nizamabad
డబ్బు ఆశ చూపించి గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

TG: రూ.10 వేలకు ఆశపడి గంజాయి రవాణాకు అంగీకరించిన ఇద్దరు ఒడిశా యువకులు నిజామాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన గణేష్ పోలి (20), దీపక్ సాహు (21)లకు గుర్తుతెలియని వ్యక్తి రూ.10వేలు ఇస్తానని చెప్పి గంజాయి తరలించేలా ప్రలోభపెట్టినట్లు పోలీసులు తెలిపారు. షిర్డీలో ఆగి ఉన్న ఆటోలో 2 సూట్ కేసులు పెట్టి రావాలన్నారు. ఆ ప్రకారం శిరిడీ ఎక్స్ ప్రెస్ రైలులో సూట్‌కేసులు పెట్టుకుని వెళ్తుండగా నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా, సుమారు 24.3 కిలోల ఎండు గంజాయి బయటపడింది.

More in Local