రాపిడో రైడర్గా MLC తీన్మార్ మల్లన్న
TG: హైదరాబాద్లో MLC, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వినూత్నంగా రాపిడో రైడర్గా మారారు. నగరంలో ఓ ప్రయాణికుడు రాపిడో బుక్ చేసుకోగా, స్వయంగా బైక్పై వెళ్లి అతడిని పికప్ చేసి ఇంటి వద్ద దింపారు. ప్రయాణం ముగిసిన తర్వాత హెల్మెట్, మాస్క్ తొలగించడంతో కస్టమర్ ఆశ్చర్యపోయి మల్లన్నను గుర్తించాడు. రాపిడో రైడర్ల కష్టాలు, సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ ప్రయోగం చేసినట్లు ఆయన తెలిపారు.



