కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్డుల పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు.



