← Back to news

టార్గెట్ పవన్ కళ్యాణ్.. అన్వేష్ సెటైర్

By Krishna· 17h ago· Instagram

యూట్యూబర్ అన్వేష్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రోజుకో రకమైన వీడియో సందేశం ఇస్తూ.. తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా భారత దేశానికి క్యాన్సర్ వచ్చేసిందంటూ.. AP DCM పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. వినాయక చవితికి మట్టి విగ్రహాలే వాడాలి అనే సందేశం ఇస్తూనే.. ఇండియా పరిస్థితి దారుణంగా తయారైందనీ, దేశానికి కాలుష్య క్యాన్సర్ పట్టుకుందని చెబుతూ వీడియో చేశారు. తాను రష్యాలో ప్రజలకు మట్టి విగ్రహాలు తయారుచేసి ఇస్తానని మాట ఇచ్చానని అన్వేష్ అన్నారు. ఈ <a href="https://www.instagram.com/p/DdK6qdgTIhG/">వీడియో</a> వైరల్ అవుతోంది.

More in Viral

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!
Viral· 1d ago

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!

AP: మచిలీపట్నం సూపర్‌మార్కెట్‌లో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో షాపింగ్‌ విషయంలో కస్టమర్లకు <a href="https://x.com/telugodikeka/status/2098256314342523224">ఓ అలర్ట్‌ వైరల్‌ అవుతోంది.</a> షాపింగ్‌ చేసేటప్పుడు బోర్డుపై కనిపించిన రేట్‌ చూసి ఐటమ్స్‌ బుట్టలో వేసుకోవడం, బిల్‌ వచ్చాక చెక్ చేయకుండా పే చేయడం చేస్తుంటాం. ముఖ్యంగా ఎక్కువ ఐటమ్స్‌ కొంటే ధరలు గుర్తుండవు. అందుకే ప్రతి ఐటమ్‌ రేట్‌ను ముందే ఫొటో తీసుకోవడం, బిల్‌ వచ్చిన తర్వాత ఒక్కో ప్రైస్‌ను క్రాస్‌ చెక్‌ చేయడం మంచిది. లేకపోతే దగ్గర్లోని కిరాణా షాపులో ధరలు పోల్చి కొనడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.