కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం

TG: వరంగల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను స్థానిక MGM ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. MLA కేఆర్ నాగరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.


