ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. చివరకు ప్రమాదం

TG: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తిరందాజ్ టాకీస్ సమీపంలో సంగీత మొబైల్ ఎదురుగా మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. గుంతను 15 రోజులుగా పూడ్చకపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితమే స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇద్దరు వ్యక్తులు అదే గుంతలో పడిపోయారు. టర్నింగ్ వద్ద గుంత ఉండటంతో ఎప్పుడు పెద్ద ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.



