ఇండియన్ షిప్ పై దాడి.. 13 మంది భారతీయులు?

ఎర్ర సముద్రం (Red Sea)లో ఇండియన్ షిప్ 'MSV Faize Noore Oliya' పై మిసైల్ దాడి జరిగింది. యెమెన్ జలాల దగ్గర్లో నిన్న జరిగిన ఈ ఘటనలో షిప్ మునిగిపోయింది. షిప్లో 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది స్టాఫ్ను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించి వైద్యసాయం అందించింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, సిబ్బంది భద్రతతో పాటు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని DGMను ఆదేశించినట్లు వెల్లడించారు.



