← Back to news

చేయూత పెన్షన్‌కు 31 చివరి గడువు: MPDO

By Repalle Rajesh· 27 Aug 2026
చేయూత పెన్షన్‌కు 31 చివరి గడువు: MPDO

TG: చేయూత పెన్షన్‌కు అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ఎంపీడీవో అబ్దుల్ సయీద్‌ ఖాన్‌ సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫైళ్లను పంచాయతీల సమన్వయంతో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సుమారు 80 శాతం పూర్తయిందని ఎంపీడీవో తెలిపారు.

More in Local