కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ రాజీనామా

కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రోససింగ్ ఇండస్ట్రీస్ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న బిట్టూ, ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ముర్ముకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని అన్నారు.



