సచిన్, రహానెకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, క్రికెటర్ అజింక్య రహానెకు అరుదైన గౌరవం దక్కనుంది. వాంఖడే స్టేడియంలోని లాంజ్లకు సచిన్, రహానె పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ సంఘం<a href="https://www.hindustantimes.com/cricket/sachin-tendulkar-ajinkya-rahane-to-get-wankhede-lounges-as-mca-unveils-massive-500-crore-grassroots-push-101789186726028.html"> (MCA)</a> నిర్ణయించింది. మాజీ కెప్టెన్, MCA అధ్యక్షుడిగా పనిచేసిన మాధవ్ మంత్రి పేరుతోనూ ఓ లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే గ్రాస్రూట్ క్రికెట్ను మరింత బెటర్ చేయడానికి, వచ్చే పదేళ్లలో 500 కోట్ల రూపాయల ఫండ్ ఏర్పాటు చేయాలని MCA డిసైడ్ అయ్యింది.



