సొంత గడ్డపై పాక్ను వైట్వాష్ చేసిన ఇంగ్లండ్..! 🏏

పాకిస్థాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. బిర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై పాక్ను టెస్ట్ సిరీస్లో వైట్వాష్ చేయడం ఇంగ్లండ్కు ఇదే ఫస్ట్ టైమ్. 130 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే షాక్ తగిలింది. పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ ఆదిలోనే వికెట్లు పడగొట్టాడు. కానీ జో రూట్ (62), జోర్డాన్ కాక్స్ (59) అజేయంగా 128 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి జట్టును గెలిపించారు.



