ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

TG: ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి వివరణకు అవకాశం కల్పించాలని తెలిపారు.



