కర్రెగుట్టల్లో IED బ్లాస్ట్.. గిరిజనుడు మృతి

TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్న IED (ప్రెషర్ బాంబు) పేలడంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. నూగూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరో ఐదుగురితో కలిసి వెదురుబొంగుల కోసం అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా IEDపై కాలు పడటంతో బ్లాస్ట్ జరిగింది. గాయపడిన నాగేశ్వరరావును తోటి వారు గ్రామానికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే చనిపోయారు. సెప్టెంబర్ 2న ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



