కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TG : హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై దొరకుంట (కోదాడ మండలం) దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ముగ్గురు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవారు. విజయవాడ పడమటి లంకకు చెందిన చెన్నకేశవులు నాగేంద్రబాబు, బేలిపోగు మేరీ కృష్ణతో పాటు తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని ప్రాణాలు కోల్పోయారు. మిగతా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.


