← Back to news

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

By Sagar· 3d ago· Peddapalli
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావాలి: రాజ్‌ఠాకూర్‌

TG: మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్‌ఠాకూర్‌ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు సమస్యలు ఎదురైన సమయంలో కేసీఆర్‌ బాధిత ప్రాంతాలకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా అంటే పదవి, జీతం, ప్రభుత్వ సదుపాయాలు అనుభవించడం మాత్రమే కాదని, ప్రజల మధ్య నిలబడి వారి సమస్యలపై పోరాడే బాధ్యత కూడా ఉందన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.