← Back to news

విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: AISA

By Nagarjuna Nani· 26 Aug 2026· Kurnool
విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: AISA

AP: విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని AISA నాయకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అశోక్, సూర్య, రామ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపై AISA నిరంతరం పోరాడుతోందని తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.