దొంగల భయానికి చెక్.. గ్రామస్థులే రాత్రి సైనికులు
TG: గ్రామ రక్షణ కోసం హవర్గ గ్రామస్థులు వినూత్నంగా ముందడుగు వేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గలో గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో గ్రామస్థులే బృందాలుగా ఏర్పడి రాత్రివేళల్లో గల్లీగల్లీ తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. భైంసా మండలం పెండ్పల్లిలో ఇటీవల దొంగతనాల ఘటనలు చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన గ్రామస్థులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.



