నిరసనల్లో సంయమనం పాటించాలి.. SP సూచన!

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం స్పెషల్ ట్రైనింగ్ జరిగింది. నిరసనలు, ఆందోళనల సమయంలో సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని SP రాజేష్ చంద్ర సూచించారు. శాంతిభద్రతలు కాపాడాలని ఆదేశించారు. బందోబస్తు విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పోలీసులు అలర్ట్గా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. ప్రజల హక్కులు కాపాడటంతో పాటు చట్టం పాటించాలని స్పష్టం చేశారు.



