హామీలు ఘనం, అమలు శూన్యం.. రైతుల ధర్నా

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు సాగునీరు అందించే టైమ్లో కరెంట్ కట్స్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మండిపడ్డారు. గంటల తరబడి పవర్ కోసం వెయిట్ చేస్తున్నా పంటలను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిసెస్ గొప్పగా ఉన్నా అమలు మాత్రం నిల్ అని ఊట్కూర్ చెక్పోస్ట్ మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు.



