← Back to news

నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

By Mahesh· 18 Jul 2026
నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

AP: అమరావతిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం చంద్రబాబును కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించేందుకు కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

More in Politics