← Back to news

పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్

By Ram krishna· 27 Aug 2026· Kadapa
పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఏడు బైక్‌లతో పాటు ఆలయం వద్ద నిల్వ ఉంచిన ఇనుప సామగ్రి చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. కేసులపై దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన ఇనుప సామగ్రిని విక్రయించగా వచ్చిన రూ.1 లక్ష నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు.

More in Local