← Back to news

జర్నలిస్టుల కష్టానికి ఫలితం రావాలి

By epuri rajaratnam· 4d ago
జర్నలిస్టుల కష్టానికి ఫలితం రావాలి

AP: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సమస్యపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య దర్శి సురేష్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు మెమో పంపడంతోపాటు, ప్రపోజల్‌ను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచుతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కృషికి ఫలితంగా స్కీమ్‌కు మార్గం సుగమం కావడంపై సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.