జర్నలిస్టుల కష్టానికి ఫలితం రావాలి

AP: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్కు ప్రభుత్వం ముందడుగు వేసింది. జర్నలిస్టుల సమస్యపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య దర్శి సురేష్కుమార్ సానుకూలంగా స్పందించారు. సీఆర్డీఏ కమిషనర్కు మెమో పంపడంతోపాటు, ప్రపోజల్ను మంత్రివర్గ ఉపసంఘం ముందుంచుతామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కృషికి ఫలితంగా స్కీమ్కు మార్గం సుగమం కావడంపై సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.



