రోస్టర్ పాయింట్ 22ను వెంటనే సవరించాలి!
TG : నిర్మల్ టీఎన్జీవో భవన్లో MCF జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ 22 వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఈ విభజన జరిగిందని, ఆ నియమాన్ని వెంటనే మార్చాలని ఆయన అడిగారు. రాజ్యాంగ నిర్మాతలు అంబేడ్కర్, పూలే చూపిన బాటలో మాలలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పి. శంకర్, శకుంతల, తిరుపతయ్య, బత్తుల రంజిత్ పిలుపునిచ్చారు.



