వీడియో రిలీజ్ చేయడం కాదు, పార్లమెంట్లో మాట్లాడాలి

ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను బెదిరించడం సరికాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇందుకు ప్రభుత్వం జవాబుదారీగా నిలవాల్సి ఉంటుందని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు కేవలం కంటితుడుపు చర్యేనని, దానితో సమస్య పరిష్కారం కాదన్నారు. ఇది ఏకపక్ష మన్కీబాత్ కాదని, ప్రధాని పార్లమెంటులో మాట్లాడాలన్నారు. వెంటనే మోదీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం అమానుషమని ఫైరయ్యారు.



