రాజాం రహదారిపై పశువుల బెడద తీరదా?
రాజాం పట్టణ ప్రధాన రహదారిపై పశువుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు మధ్యలో పశువులు గుంపులుగా సంచరించడం, రోడ్డుపైనే పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డు, డోలపేట సెంటర్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై వదిలేసి పట్టించుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.



