← Back to news

రాజాం రహదారిపై పశువుల బెడద తీరదా?

By Mohan· 5d ago

రాజాం పట్టణ ప్రధాన రహదారిపై పశువుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు మధ్యలో పశువులు గుంపులుగా సంచరించడం, రోడ్డుపైనే పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డు, డోలపేట సెంటర్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై వదిలేసి పట్టించుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.