లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది



