← Back to news

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

By Jelandharkoti Koti· 21 Aug 2026

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది

More in Local