శిక్షణ పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు?

AP : నర్సీపట్నంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY) కింద 3 నెలల కోర్సు పూర్తి చేసిన యువతకు ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. రెండు బ్యాచ్ల అభ్యర్థులు శిక్షణ ముగించుకున్నా, ఒక్కరికి కూడా ఇవ్వలేదని, ఉద్యోగ ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లు అత్యవసరమని అభ్యర్థులు బాధపడుతున్నారు. ఆఫీసు సిబ్బందిని ఎన్నిసార్లు అడిగినా దాటవేత సమాధానాలే చెబుతున్నారని అంటున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.



