అనాథ శవాలకు అంత్యక్రియలు.. ఎండిఆర్ మానవత్వం

మరోసారి అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. పటాన్చెరు పట్టణంలో మహంకాళి దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడి ఉండగా స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి బస్టాండ్ ముందు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని చికిత్సలో మృతి చెందాడు. వీరిద్దరి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఎండిఆర్ ఫౌండేషన్కు సమాచారం ఇవ్వగా వారు అంత్యక్రియలు నిర్వహించారు.



