సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన

సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది మంగళవారం లంచ్ అవర్లో నిరసన చేపట్టారు. సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.



