← Back to news

సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన

By VIJAY· 3d ago· Janagama, Narayanpur, Yadadri Bhuvanagiri
సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన

సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది మంగళవారం లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. సీపీఎస్‌ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.