కోడిపందేలు ఆడుతూ ఏడుగురు అరెస్ట్

TG: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం వెంకంపేట శివారులో కోడిపందేలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. రూ.2 లక్షల సొంత పూచీకత్తుపై బాండ్లు తీసుకున్నారు. ఘటనలో పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే రౌడీషీట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.



