← Back to news

లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి

By rajaratnam· 3d ago
లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపుర, నూతక్కి వ్యవసాయ సొసైటీల రైతులు నిరసనకు దిగారు. పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆన్‌లైన్ నమోదు తహసీల్దార్ కార్యాలయం దగ్గర తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. నూతక్కి సొసైటీలో 62 మంది రైతులకు రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారు. రామచంద్రాపురంలో వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, వేంద్రపాడు లంక భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.<br>భూములు లేకుంటే రైతులు ఎలా బతుకుతారు?

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.