లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపుర, నూతక్కి వ్యవసాయ సొసైటీల రైతులు నిరసనకు దిగారు. పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆన్లైన్ నమోదు తహసీల్దార్ కార్యాలయం దగ్గర తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. నూతక్కి సొసైటీలో 62 మంది రైతులకు రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారు. రామచంద్రాపురంలో వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, వేంద్రపాడు లంక భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.<br>భూములు లేకుంటే రైతులు ఎలా బతుకుతారు?



